నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయం లో 2026-27 విద్యా సంవత్సరనికి 9, 11వ తరగతులలో ప్రవేశాలకు నేటితో గడువు ముగిసిపోవడంతో ఆ గడువుని అక్టోబర్ 7 వరకు పెంచుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనీ 2025- 26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి, పదవ తరగతి చదివేవారు అర్హులని ఆయన తెలిపారు.2026 ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు https://www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇట్టి అవకాశాన్ని గ్రామీణ ప్రాంతలలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES