- Advertisement -
- – బాధిత రైతు కు రూ.1.20 లక్షల నష్టం
నవతెలంగాణ – నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో రైతు బీరo అశోక్ కు చెందిన పాడి గేదే మేతకు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యుత్ వైర్ తెగిపడి మృతి చెందింది. ప్రమాదవశాస్తు విద్యుత్ వైరు పాడిగేదపై తెగిపడడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందిందని మిగిలిన గేదెలకు ఎలాంటి ప్రమాదం వాటిల్ల లేదని రైతుకు పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. మృతి చెందిన పాడి గేదె విలువ సుమారు రూ.1.20 లక్షలు వరకు ఉంటుందని బాధిత రైతు బోరున విలపించారు. ప్రభుత్వo ,విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు, గ్రామస్థులు కోరుతున్నారు.
- Advertisement -