- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలో నవరాత్రి దుర్గామాత దేవి విగ్రహాలు వాడవాడలో కోలువుదీరాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన కొలువుదీరిన దుర్గామాత దేవి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మంగళవారం మండలంలోని హెచ్ కేలూర్ గ్రామంలో కొలువుదీరిన దుర్గ దేవి విగ్రహం వద్ద సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు చేపడతామని ఉదయం రాత్రి ప్రత్యేక పూజలు పాల్గొంటామని మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ తెలిపారు.
- Advertisement -