Thursday, September 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ. 29.21 కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

రూ. 29.21 కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

- Advertisement -

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద నిర్మాణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ.29.21 కోట్ల వ్యయంతో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి తదితర రైల్వే స్టేషన్లు ఈ పథకంలో ఉన్నాయి. భారతీయ రైల్వేలు ”అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌” (ఏ.బి.ఎస్‌.ఎస్‌) ద్వారా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

హఫీజ్‌పేట అమృత్‌ రైల్వే స్టేషన్‌
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో ముఖ్యమైన సబర్బన్‌ రైల్వే స్టేషన్లలో ఒకటిగానున్న హఫీజ్‌ పేట స్టేషన్‌ సబర్బన్‌ గ్రేడ్‌-3 (ఎస్‌.జి-3)గా వర్గీకరించబడింది. ప్రస్తుతం, ఈ స్టేషన్‌ ప్రధానంగా సబర్బన్‌ ప్రయాణీకులు, స్వల్ప దూర రైళ్ల ప్రయాణీకుల అవసరాలను తీరుస్తోంది. స్టేషన్‌కు సగటున రోజుకు 9,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ స్టేషన్‌లో దాదాపు 60 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగుతున్నాయి. హఫీజ్‌పేట స్టేషన్‌ ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో ఈ స్టేషన్‌ రోజురోజుకూ ప్రాముఖ్యత పెరుగుతున్నది. ప్లాట్‌ఫామ్‌ పైకప్పు, సర్క్యులేటింగ్‌ ఏరియా, స్టేషన్‌ భవనం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చివరి దశలో వెయిటింగ్‌ హాల్‌ పునరుద్ధరణతో పాటు స్టేషన్‌ భవనానికి మెరుగుదల, ప్లాట్‌ఫామ్‌ ఉపరితలం మెరుగుదల, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లతో పాటు 12 మీటర్ల ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సూచిక బోర్డులు, టాయిలెట్‌ బ్లాక్‌లు, ముఖభాగం లైటింగ్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. ఒకట్రెండు నెలల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -