నవతెలంగాణ- రాయపోల్
రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఆధునిక పద్ధతులలో ఉపయోగించాలని నవ భారత నిర్మాణ సంస్థ కో ఆర్డినేటర్ దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. గురువారం రాయపోల్ మండలం ముంగిస్ పల్లి, ఆరేపల్లి గ్రామాల్లో నవ భారత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పత్తి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అనుసరించాలని సూచించారు. వావిలకు కషాయం పిచికారీ చేయడం వలన పచ్చదోమ, పెనుబంక, తెల్లదోమ వంటి రసపీల్చే పురుగులు నశిస్తాయని తెలిపారు.
అదేవిధంగా అగ్నియస్త్రం వాడకంపై వివరించి, వావిలకు తయారీ విధానం చూపించారు.పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ఎర పంటలుగా బంతి, ఆముదం వేసుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని వివరించారు.ఈ సందర్భంగా మహిళలు వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో ముందుకు రావాలని మారి సంస్థ ప్రతినిధులు సూచించారు. పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఫెసిలిటేటర్లు మహేశ్వరి, రవళి,శ్రీకాంత్, కరుణాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సేంద్రీయ పద్ధతులపై పత్తి రైతులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES