ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని వావిలాల సెక్టర్ పరిధిలో బతుకమ్మ పండగ, శ్రమదానం, గర్భిణుడు బాలింతలు కిశోర బాలికలు తీసుకోవాల్సిన పౌర్చికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ సెక్టార్ సూపర్వైజర్ మల్లీశ్వరి తెలిపారు. గురువారం సెక్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లు వావిలాల అంగన్వాడి రెండవ సెంటర్లో పోషకాహార వారోత్సవాలు బతుకమ్మ నరసింహుల గూడెం అంగన్వాడి వన్ సెంటర్లో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కిశోర బాలికలు అంగన్వాడీ టీ షర్టులు అందించే పౌష్టికాహారం ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు రక్తహీనత పై కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వావిలాల సెక్షన్ పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్లు ఆయాలు గర్భిణీ స్త్రీలు బాలింతలు, కిషోర్ బాలికలు వివో తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ శ్రమదానం పౌష్టికాహారంపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES