- Advertisement -
నవ తెలంగాణ – రామారెడ్డి
కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ 60వ జన్మదిన సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి బుధవారం ఆయనకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, కష్టనష్టాలను ఓర్చుకొని పార్టీ కోసం పనిచేసిన ప్రజానాయకుడు కైలాస్ శీనన్న ఆయురారోగ్యాలతో, ఉన్నత పదవులను పొంది, ప్రజాసేవలో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, క్రీడా సభ్యులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -