శ్రావణ్ కుమార్ రాందిని హీరోగా పరిచయం చేస్తూ హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ ప్రొడక్షన్ నెం.1గా విఐపి ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ వ్యాస్ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ చిత్రం విజయదశమి పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ యాక్టింగ్ ట్రైనర్ సత్యానంద్ అతిథిగా హాజరై కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. భాజపా ఏపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు స్క్రిప్ట్ అందించారు. సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శ్రావణ్ కుమార్ రాంది, సుమంత్ మక్కా, జీవన్ జాస్ఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ – కపర్ది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – లాలం కన్నాజీ, ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని, డీవోపీ – రొప్ప గోపీకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ, యాక్షన్ కొరియోగ్రఫీ – రామ కృష్ణ, నిర్మాత – డా. చింతాడ హేమారావు, రచన, దర్శకత్వం – నాగ వ్యాస్.
సరికొత్త ప్రేమకథ మొదలైంది
- Advertisement -
- Advertisement -