నవతెలంగాణ – మల్హర్ రావు
మద్యం దుకాణాల టెండర్లపై స్థానిక ఎన్నికల ప్రభావం అధికంగా పడుతుందనే చర్చ సాగుతోంది. మరోవైపు దరఖాస్తు ఫీజు సైతం రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా చాలా మంది స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల టెండర్లు వేద్దామా.. లేక ఎన్నికల బరిలో ఉందామా అనే ఆలోచనలో తర్జనభర్జన పడుతు న్నట్లు తెలుస్తోంది. గతంలో టెండర్ల ప్రక్రియ మొద లైన మొదటివారం నుంచే దరఖాస్తుల హడావుడి కనిపించేది. కానీ ఈసారి ఊహించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇంకా దరఖాస్తు చేసుకోవడా నికి 11 రోజుల వ్యవధి ఉన్న క్రమంలో చివరి వారం రోజుల్లో వేగం పుంజుకుంటుందా.. లేక ఇలాగే ఉంటుందోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చివరి నాలుగు రోజుల్లో భారీగా టెండర్లు రావొచ్చనే ధీమాలో ఎక్సైజ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక పోతే ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేకపోలేదు. కాగా..కాటారం డివిజన్ లో బుధవారం నాటికి ఏడు టెండర్లు దాఖలయ్యాయని తెలుస్తోంది.
మద్యం టెండర్లపై ఎన్నికల ఎఫెక్ట్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES