జిల్లా పరిషత్ మాజీ పవర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
కార్యకర్తల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు బెస్త గంగామణి తండ్రి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, హోటల్ గంగయ్య కొద్ది రోజుల క్రితం నుండి అనారోగ్యం తో బాధపడుతూ.. మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి బుధవారం గంగయ్య కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. హోటల్ గంగామణికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పట్ల గంగయ్యకు ఉన్న నిబద్ధత, ఆయన చేసిన సేవలను కొని యాడి, సంతాపాన్ని వ్యక్తం చేసి,ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘోతం రెడ్డి,ఎండీ సల్మాన్, ఖాసీం ఖాన్ చిన్న గంగారెడ్డి,కూడలి ఎల్లం, దయానంద్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES