నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
శాస్త్రీయ విద్య సాధన కై ఉద్యమించాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో సిర్పూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యార్థులకు ఉపయోగపడే విధానాలను విద్యలో ప్రవేశపెట్టడం లేదని , కేంద్ర ప్రభుత్వం విద్యలో శాస్త్రీయంగా ఉన్నటువంటి సైన్స్ పాఠ్యాంశాలను తొలగిస్తూ అశాస్త్రీయ పాఠ్యాంశాలను పెడుతూ విద్యార్ధుల మెదళ్లను కలుషితం చేస్తున్నారని , ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలని , ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పనకై విద్యకు అధిక సంఖ్యలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు సాయి కిరణ్, బండమీద అజయ్,మనోజ్ తదితదిరులు పాల్గొన్నారు.
శాస్త్రీయ విద్య సాధనకై పోరాడుదాం: పీడీఎస్ యూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES