Saturday, October 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీసీ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

బీసీ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు..
నవతెలంగాణ – కల్వకుర్తి
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దింపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలో మహబూబ్నగర్ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించింది. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్నీ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదని విమర్శించారు. శాసనసభలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని తెలిపారు. బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలనీ, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నిం టినీ కాలరాస్తున్నదని విమర్శించారు.

రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లే ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిరదని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ బి ఆంజనేయులు శ్రీ ఆంజనేయులు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఏపీ మల్లయ్య సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి శంకర్ నాయక్ శివవర్మ సీపీఐ(ఎం) జిల్లా నాయకులు నాగపూర్ మధు రాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -