నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం దుకాణాలకు శనివారం (34) అప్లికేషన్స్ రాగా, మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాలకు మొత్తం (149) దరఖాస్తులు రావడం జరిగింది అని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరిడెండ్ కార్యాలయం నుండి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను (53)దరఖాస్తులు వచ్చాయి.బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు (23) దరఖాస్తులు వచ్చాయి.
ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు (36) దరఖాస్తులు వచ్చాయి. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను (22) దరఖాస్తులు వచ్చాయి. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం (11) వైన్ షాప్లకు గాను (15) దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్ లకు (149)దరఖాస్తులు వచ్చాయి.