-ఇతర బ్యాంకులకంటే మరింత అధిక వడ్డీ
-సీనియర్ సిటిజన్స్,మహిళలకు ప్రయోజనం
-కరపత్రాలతో ప్రచారం నిర్వహించిన మేనేజర్ ప్రవీన్
నవతెలంగాణ – బెజ్జంకి
కేడీసీసీ బ్యాంకు అందిస్తున్న ‘సౌభాగ్య’ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ప్రవీన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఇంటింటా కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ సిబ్బందితో కలిసి కరపత్రాలతో సౌభాగ్య పిక్స్ డ్ డిపాజిట్ పథకంపై ప్రచారం నిర్వహించారు. ఇతర బ్యాంకుల కంటే కేడీసీసీ బ్యాంక్ 333 రోజుల కాలపరిమితికి సౌభాగ్య పథకంలో సాదారణ ప్రజలకు సుమారు 8 శాతం, సీనియర్ సిటిజన్స్,మహిళలకు సుమారు 8.5 శాతం వడ్డీ అందజేస్తుందని మేనేజర్ ప్రవీన్ తెలిపారు. వివరాలకు మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయాన్ని సంప్రదించాలని మేనేజర్ కోరారు.
కేడీసీసీలో సౌభాగ్య పథకానికి అధిక వడ్డీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES