బోరుబావిలో పడిన చిన్నారి..

నవతెలంగాణ – గుజరాత్: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారిని రెస్క్యూ టీమ్‌ కాపాడింది. దాదాపు 9 గంటలపాటు శ్రమించి బయటకు తీసుకొచ్చింది. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై జిల్లా యంత్రాంగానికి సమాచారం అందడంతో రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి సిబ్బంది.. బుధవారం తెల్లవారుజామున బాలుడికి బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం వెంటనే జామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Spread the love