విమానం హైజాక్ అంటూ మెయిల్..

నవతెలంగాణ- హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైజాక్ అంటూ అర్థరాత్రి మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. హైజాక్ తాలూకు ఎలాంటి ఆనవాళ్లూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ మెయిల్ గా అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ఈ మెయిల్ ఎవరు చేశారనే దానిపై విచారణ చేపట్టారు.

Spread the love