నవతెలంగాణ – హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రాబోతోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం విడుదల కానుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ఈ రాష్ట్రాల్లో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలి వారంలోపు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్గఢ్లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.