గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: షాద్ నగర్లోని ఎలికట్టి గ్రామంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి చెందాడు. ఝార్ఖండ్కు చెందిన జితేందర్ కుమార్ రాత్రి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు. అతడు చనిపోయినట్లు గుర్తించిన తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్మార్టం చేయగా గొంతులో చికెన్ ముక్కలు కనిపించాయి. గొంతులో చికెన్ ఇరుక్కుపోవడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Spread the love