మోడీ మ్యాచ్ చూడ్డం వల్లే భారత్ ఓడిందన్న రాహుల్‌గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మ్యాచ్‌ను వీక్షించేందుకు మోడీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. ఇండియా దాదాపు ప్రపంచకప్‌ను గెలుచుకుందని, కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోడీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని, కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని, అయితే ఓ చెడు శకనం మ్యాచ్‌కు రావడం వల్ల  మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

Spread the love