- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ చరిత్రలో కోల్కతా-గుజరాత్ మ్యాచ్ కొత్త రికార్డు సృష్టించింది. ఒకే మ్యాచ్లో ఆరుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. అలెన్(93), రఘువంశీ(82), గ్రీన్(52) కోల్కతా తరఫున అర్ధశతకాలు సాధించగా, శుభమన్ గిల్(85), బట్లర్(57), సుదర్శన్(53) గుజరాత్ తరఫున హాఫ్ సెంచరీలు చేశారు. అలాగే ఈ సీజన్లో ఇప్పటివరకు 52 సార్లు జట్ల స్కోర్ 200కు పైగా నమోదవడం మరో రికార్డుగా నిలిచింది.
- Advertisement -



