చెరువులో పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ – భిక్కనూర్
చెరువులో పడి వ్యక్తి మరణించిన సంఘటన మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శంకర్ (46) గత కొంతకాలంగా కడుపునొప్పి, చాతి నొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం కడుపునొప్పి బాధ భరించలేక ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, కుటుంబీకుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం గ్రామంలోని చెరువు వద్ద చెప్పులు, బట్టల ఆనవాళ్లు కనిపించగా గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతికి చూడగా శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.

Spread the love