పగిడిపల్లి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పట్టణం 12వ వార్డు పగిడిపల్లి,  తాత నగర్  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ..భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్ శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డికి వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోటకూరి వెంకటేశ్ యాదవ్, ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్, ఎన్ ఎస్ యు ఐ  ఉపాధ్యక్షులు నోముల తరుణ్ పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్, వడిగం శ్రీనివాస్, రేగుల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Spread the love