![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230825-WA0188.jpg)
చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాసరెడ్డిని శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన పలువురు నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందిస్తూ ఎన్నికల ముందే రెవెన్యూ డివిజన్ ప్రకటన వస్తుందని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.ఎమ్మెల్సీని కలిసిన వారిలో పొన్నం వెంకటేష్ గౌడ్, పచ్చిమడ్ల మానస, చంద శ్రీకాంత్, కూరపాటి నర్సింహులు ఉన్నారు.