నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్బోర్న్ రెనెగేడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మార్ష్.. చివరిసారిగా బుధవారం(జనవరి 17) సిడ్నీ థండర్స్తో తన చివరి మ్యాచ్ ఆడనున్నారు. “నేను రెనిగేడ్స్కు ఆడటాన్ని ఎంతో ఇష్టపడ్డాను.. జట్టులోని సహచరులు అందరూ నాకు మంచి స్నేహితులు.. వీరితో నా స్నేహం జీవితాంతం గుర్తుంటుంది. నా ఈ ప్రయాణంలో సహాయపడ్డ కోచ్లు, సిబ్బంది, తెరవెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..” అని మార్ష్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తంగా మార్ష్ ఆసీస్ తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ2లు ఆడాడంతే. సుదీర్ఘ ఫార్మాట్లో 2,265 రన్స్, వన్డేల్లో 2,773 పరుగులు బాదిన మార్ష్ టీ20ల్లో 255 రన్స్ కొట్టాడు. ఇక బీబీఎల్ 2023-24 సీజన్లో మార్ష్ ఐదు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 45.25 సగటుతో రాణించిన అతడు మూడు హాఫ్ సెంచరీలతో 181 రన్స్ కొట్టాడు.