కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ విడుదల..

నవతెలంగాణ – హైదరాబాద్ : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ కలిసి నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆధారంగా ఈ చిత్రం 1930ల బ్యాక్ డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. బ్రిటీషర్లకు వ్యతిరేఖంగా పోరాడే పాత్రలో అదరగొట్టేసిన ధనుష్ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. నెట్టింట ఈ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తుంది.  పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మించిన ఈ మూవీ తెలుగులో మాత్రం విడుదల కావడంలేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో కూడా నాలుగు బడా సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయి. కాగా.. అరుణ్ మాత్వేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’లో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, వినోత్ కిషన్, నాసర్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు.

Spread the love