బీజేపీ నాయకుల బృందం రేపు మేడారం రాక

– బీజేపీ మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు 
నవతెలంగాణ – తాడ్వాయి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు సభలో ములుగు జిల్లాలో సమ్మక్క- సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీ ప్రకటించిన సందర్భంగా రేపు బుధవారం వనదేవతల దర్శించుకోవడానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు అర్జున్ ముండా, కేంద్ర పర్యటక శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జాతీయ,  రాష్ట్ర జిల్లా నాయకులు వనదేవతలను దర్శించుకోవడానికి  మేడారం వస్తున్నట్లు బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేల రాంబాబు తెలిపారు. బిజెపి ప్రజా ప్రతినిధులు, బిజెపి సీనియర్ నాయకులు, బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు, బీజేపీ శ్రేణులు మొత్తం మేడారం వచ్చి బీజేపీ నాయకుల పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట బీజేపీ శ్రేణులు, అనుబంధ సంఘాల నేతలు తదితరులు ఉన్నారు.
Spread the love