ఘోర రోడ్డు ప్రమాదం 28 మంది మృతి

నవతెలంగాణ – పాకిస్తాన్: పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడమే అందుకు కారణమని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. టర్బాట్‌ నుంచి క్వెట్టాకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది.

Spread the love