రోడ్డు ప్రమాదంలో ఒకరికి తువ్వాలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి శనివారం తీవ్ర గాయాలైయ్యాయి.స్థానికుల కథనం ప్రకారం  ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం సుబ్బన్న పేట గ్రామానికి చెందిన గంగుల ఆంజనేయులు ద్విచక్రవాహనం పై అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం వైపు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే తిమ్మాపురం మూల మలుపు వద్ద అదుపుతప్పి కింద పడిపోయాడు.గమనించిన స్థానికులు స్థానిక చిట్టితల్లి అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో బాధితుడిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు కు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.
Spread the love