ఆలయ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించిన దాతకు సన్మానం..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన  శ్రీ షిరిడి సాయి దేవాలయం, సారం గుట్ట అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సరసం రాజేశ్వర్ ను శనివారం ఆలయ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన సరసం రాజేశ్వర్ శ్రీ శిరిడి సాయి, సారంగట్ట అయ్యప్పస్వామి దేవాలయాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇటీవల అమెరికా నుండి వ్యక్తిగత పనులను నిమిత్తం  స్వగ్రామానికి విచ్చేసిన ఆయనను ఆలయ అభివృద్ధి కమిటీల  సభ్యులు ఆలయాల సందర్శనకు ఆహ్వానించారు. సారం గుట్ట అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించిన డాక్టర్ రాజేశ్వర్ ను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. షిరిడి సాయి ఆలయంలో వద్ద ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సరసం రాజేశ్వర్ గ్రామంలో  షిరిడి సాయి దేవాలయం, సారాం గుట్ట అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు గురు స్వామి మేడారం భూమన్న, బద్దం గంగారెడ్డి, అవారి పెద్ద బాజన్న, బద్ధం శ్రీనివాస్, బద్దం తిరుపతిరెడ్డి, బద్దం సుభాష్ రెడ్డి, ఉత్తూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love