దెబ్బతిన్న ఇండ్ల పరిశీలన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్,ఇనాయత్ నగర్ సర్పంచ్ తండాలో శుక్రవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలులకు, వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను తహసిల్దార్ ఆంజనేయులు ఆదేశాల మేరకు  రెవిన్యూ ఇన్స్పెక్టర్ శరత్ శనివారం సందర్శించి పరిశీలించారు. బలంగా వీచిన ఈదురుగాలులకు రెండు గ్రామాల్లో పలు ఇండ్ల   పైకప్పు రేకులు కొట్టుకుపోగా, నివాస గుడిసెలు నేల కులాయి. అట్టి ఇండ్లను  రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్ పరిశీలించి నష్టం అంచనా వివరాల నివేదికను తహసిల్దార్  కు అందజేసినట్లు ఆయన తెలిపారు.  అమీర్ నగర్ లో 4ఇండ్లు, 2 గుడిసెలు, ఇనాయత్ నగర్  సర్పంచ్ తండాలో 4 ఇండ్లకు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు.
Spread the love