చామల గెలుపు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది..

– నేడు భువనగిరి లో చామల నామినేషన్ కు తండోపతండాలుగా తరలిరానున్నారు..
– భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి గెలుపు తీర్పు చరిత్రలో నిలిచిపోయే  విధంగా 4 లక్షల మెజార్టీతో  ప్రజలు తీర్పు ఉన్నారని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్వి మునుగోడు నియోజకవర్గ నాయకులు, మాజీ వార్డ్ మెంబర్ బోయే సతీష్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు భువనగిరి లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ అనంతరం భువనగిరి లో నిర్వహించే భారీ ర్యాలీ కి భువనగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీని విజయవంతం చేసేందుకు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు,  మాజీ జెడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love