యూజర్లకు ట్విట్టర్ ట్విస్ట్..

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఎక్స్‌ (X) వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్‌ కొత్త యూజర్లు పోస్ట్‌ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్‌ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఏడాదికి ఒక డాటర్‌గా సంస్థ వసూలు చేయనుంది.

Spread the love