చెరువులో పడి మహిళ మృతి

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్ 
మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి మానసిక స్థితి బాగా లేక కాడి చెరువులో పడి మరణించినట్టు ఎస్సై వినయ్ గురువారం తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం పడగల్ గ్రామానికి చెందిన అశోక్ వివాహం అయి విడాకులు తీసుకొని ఆమె తండ్రి ఇంటి వద్దే ఉంటుంది. విడాకులు తీసుకున్నప్పటి నుండి మానసిక వ్యాధి తో భాదపడుతున్నది. తరచూ ఇంటి నుండి వెళ్లి  రెండు మూడు రోజులకొకసారి ఇంటికి వచ్చేది. 26. తేదీ ఇంటి నుండి వెళ్లి మళ్ళీ ఇంటికి రాలేదు.. మానసిక స్థితి బాగా లేక కాడి చెరువు లో పడి చనిపోయినదని ఆమే తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Spread the love