మంచిర్యాలలో వైద్యం వికటించి మహిళ మృతి…

Suicidనవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూర్, బొట్టిగుడెంకు చెందిన జోడు మధునక్క (45) అనే మహిళకు కడుపు నొప్పి రావడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోం ప్రైవేటు హాస్పిటల్‌ అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించి గర్భసంచి సమస్య ఉందని, తిసేయలని కుటుంబ సభ్యులకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి గర్భ సంచిని తొలగించారు. అలాగే రక్తం తక్కువ ఉండడంతో రక్తం కూడా ఎక్కించారు. గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెలో నొప్పి వస్తుందని, శ్వాస సరిగా అందడం లేదని మధున తెలిపిందని, గంటన్నర సమయంలో తను మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతురాలికి భర్త పోషం, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు దవాఖానకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love