బోరులో ఇరుక్కుపోయిన కార్మికుడు..

చండీగఢ్‌: ఢిల్లీ నుంచి జమ్మూలోని కట్‌రా వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పంజాబ్‌ జలంధర్‌లోని కర్తార్‌పుర్‌ సమీపంలో భారీ పిల్లర్‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద గొయ్యి తొవ్వారు. ఈ క్రమంలో లోపల బోరింగ్‌ యంత్రంలో సమస్య తలెత్తడంతో ఇద్దరు కార్మికులు అందులోకి దిగారు. అనంతరం ఓ కార్మికుడు పైకి రాగా.. సురేశ్‌ అనే వ్యక్తి మాత్రం 70 అడుగుల లోతులోనే చిక్కుకుపోయాడు. అతడిపై ఇసుక పడటంతో బయటకు రాలేకపోయినట్లు సమాచారం. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేయడంతో.. వారితోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

Spread the love