నవతెలంగాణ – కర్ణాటక: కర్ణాటక హుబ్బళ్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ కుమార్తె నేహా హిరేమత్ను కాలేజీ క్యాంపస్లోనే ఫయాజ్ అనే యువకుడు అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. పోలీసులు ఫయాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. బీసీఏ కోర్సు సమయంలో వీరిద్దరూ కలిసి చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తామిద్దరం ప్రేమించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. కానీ, కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఆమె తనను దూరం పెడుతుండటంతోనే హత్య చేశానని ఫయాజ్ అంగీకరించాడు.