- Advertisement -
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
జిల్లా సంక్షేమ శాఖలో గతంలో పనిచేసిన ఓ అధికారిపై ఆవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మంగళవారం కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. అనంతరం అధికారులు పూర్తి వివరాలు తెలిపే అవకాశం కలదు. కొన్ని రోజుల క్రితమే సంక్షేమ శాఖ అనుబంధంగా కొనసాగే జిల్లా బాలల పరిరక్షణ అధికారిని జిల్లా కలెక్టర్ సర్వీస్ రిమూవల్ చేశారు. ఇప్పుడు సంక్షేమ శాఖలోనే ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం సృష్టిస్తున్నాయి.
- Advertisement -



