- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలం కొయ్యుర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ సభావత్ సవేందర్ ఆధ్వర్యంలో చేయుత పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ప్రభుత్వం అర్హులైన వారికి చేయుత పింఛన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దరఖాస్తులను స్వీకరించారు. వితంతు, వృద్ధులు, వికలాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు వస్తాయని, ఎవరు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కొయ్యుర్ ఎస్-2 రాజన్ కుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



