ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను పశువులకు వేయించండి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ప్రభుత్వం ద్వారా ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను పశువులకు వేయించాలని మండల పశువైద్యాధికారి శిరీష మంగళవారం మండలంలోని కేసు పల్లి గ్రామంలో అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను ఇవ్వడం జరిగిందని పశువైద్యాధికారి శిరీష తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో పశువులు ఉన్న రైతులు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలను పశువులకు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గోపాలమిత్ర రాజ్ కుమార్ రైతులు పాల్గొన్నారు.
Spread the love