నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నియామక పరీక్షలో నకిలీల బెడదకు కృత్రిమ మేధతో చెక్ పడింది. మంగళవారం జరిగిన ఈ పరీక్షకు ఏకంగా 87 మంది నకిలీ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అభ్యర్థుల గుర్తింపును తనిఖీ చేసేందుకు ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ను వినియోగించారు. దీంతో, నకిలీల గుట్టురట్టయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.