నవతెలంగాణ-రామారెడ్డి
జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో అఖిలభారత ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 76వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు కే నర్సింలు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. యూనియన్ ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సెక్రటరీ నాగేశ్వరరావు, బ్రాంచ్ మేనేజర్ కృష్ణమోహన్, ముఖ్యఅతిథిగా ఆప్టికల్ హబ్ డాక్టర్ బాలు నాయక్, అధికారులు శ్రీనివాసరావు, అనర్ధన్, విద్యాసాగర్, డెవలప్మెంట్ ఆఫీసర్లు సందీప్, వెంకటేశ్వరరావు, ప్రవీణ్, నరేష్ , లియఫి నాయకులు కిషోర్ చంద్, కదం నారాయణరావు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఐఈఏ 76వ వ్యవస్థాపక దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



