– ఫలించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తల కృషి
– ఒడిశా తీరంలోని చండీపూర్ నుంచి ప్రయోగం
భువనేశ్వర్ : భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివద్ధి సంస్థ (డీఆర్డీఓ) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకె ళ్లే మానవరహిత లక్ష్యంపై డీఆర్డీఓ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణి ఆయుధ వ్యవస్థ విజయవంతంగా అడ్డగించి ధ్వంసం చేసింది. ఈ పరీక్ష ద్వారా డీఆర్డీఓ స్వదేశీయంగా అభివద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థలోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను, లాంఛర్ను, మల్టీ ఫంక్షన్ రాడార్ అండ్ కమాండ్, కంట్రోల్ను, కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించింది. డీఆర్డీఓ, భారత వైమానిక దళం (ఐఏఎఫ్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కి చెందిన సీనియర్ అధికారులు ఈ క్షిపణి పరీక్షలో పాల్గొన్నారు. ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహి ంచిన డీఆర్డీఓ, ఐఏఎఫ్తోపాటు క్షిపణి పరీక్షల ఇండిస్టీని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. తాజా పరీక్ష సక్సెస్ కావడంతో భారత రక్ష ణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.