బీజేపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పలువురు మహిళలను లైంగికంగా వేధించారని ఆర్ఎస్ఎస్ సభ్యుడు శాంతను సిన్హా ఆరోపించడం నెట్టింట పెద్ద చర్చనీయాంశమైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సైతం డిమాండ్ చేస్తోంది. అయితే తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారంటూ శాంతనుపై మాలవీయా రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు.

Spread the love