కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయింపు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఎన్నికల కౌంటింగ్ అబ్జర్వర్లు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, ఎండి ఎజ్తబా హుస్సేన్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే జండగే సమక్షంలో రేపు 4 వ తేదీన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కార్యక్రమం సందర్భంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవిఎం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సిబ్బందిని రాండమైజేషన్ ప్రక్రియల ద్వారా  కేటాయించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి  బెన్ షాలోమ్, జిల్లా విద్యాశాఖ అధికారి కే.నారాయణరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్ ఉన్నారు.
Spread the love