లోయలో పడిపోయిన అమర్‌నాథ్‌ యాత్రికుడు…

నవతెలంగాణ – శ్రీనగర్‌: అమర్‌నాథ్ యాత్రలో విషాదం అలముకుంది. మహాశివుడిని దర్శించుకుని తిరిగివస్తున్న ఓ భక్తుడు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు. సైన్యం, రెస్క్యూ బృందాలు అతడిని క్షేమంగా తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ అతడు మృతిచెందాడు. బీహార్‌లోని రోహ్‌తాస్‌ జిల్లా తుంబా గ్రామానికి చెందిన విజయకుమార్ షా మమతా కుమారి అనే మరో యాత్రికుకురాలితో కలిసి అమరనాథ్ గుహ నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అతడు కాళీమాత సమీపంలో ప్రమాదవశాత్తూ పైనుంచి జారి 300 అడుగుల కింద ఉన్న లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న మౌంటెన్‌ రెస్క్యూ బృందాలు, సైన్యం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరికుని సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టారు. అయితే తీవ్రంగా గాయపడిన అతడు అప్పటికే మరణించాడని, మృతదేహాన్ని లోయలో నుంచి వెలికితీశామని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు.

Spread the love