లారీని ఢీకొన్న అంబులెన్స్.. నాలుగురు మృతి

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొంది ఓ అంబులెన్స్. ఈ సంఘటనలో 4 గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు తవంణపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకిట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు- తిరుపతి హైవే పై నిలిచి ఉన్న ట్యాంకర్ ను వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఏడు మందిలో నలుగురు మృతి చెందారు.  ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love