ఇండియా గోల్డ్ మార్కెట్ సీరీస్ యొక్క చివరి అంకమును ప్రకటిస్తోంది

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ స్వర్ణ మండలి (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) ఈ రోజున ‘గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ అండ్ ఫైనాన్షియలైజేషన్’ అనబడే తమ ఇండియా గోల్డ్ మార్కెట్ సీరీస్ యొక్క చివరి అంకమును ప్రకటించింది నివేదిక ప్రకారము, ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం బార్ మరియు నాణెం మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది, బంగారం కోసం అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి గిరాకీని స్వాధీనం చేసుకుంది. బంగారం ఆకర్షణ అనేది దాని సురక్షితమైన చక్కదనం మరియు తదుపరి దశలో ఆభరణాలుగా మార్చుకోగలిగిన దాని అనుకూలతపై ఆధారపడి ఉంటుంది. ‘బ్యాంకింగ్ చేయని వారికి బ్యాంక్’ అనే ప్రభుత్వ ప్రయత్నాలు, బ్యాంకింగ్ సేవల వాడకం పెరిగిపోవడం, మరియు ఆర్థిక ఉత్పత్తులపై బాగా ఎత్తుకు ఎదిగిపోయిన అవగాహనతో సహా వివిధ కారకాంశాల రీత్యా బంగారం మార్కెట్ యొక్క విస్తృతి నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ఈ కారకాంశాలు బంగారం కడ్డీలు మరియు నాణేల కొరకు భవిష్యత్ గిరాకీని ప్రభావితం చేసే సంభావ్యతను కలిగి ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియా ప్రాంతీయ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పిఆర్ సోమసుందరం గారు ఇలా అన్నారు, “శతాబ్దాల పాటుగా భారతీయుల గృహాలలో కూడగట్టుకుపోయి నిలిచియున్న బంగారం యొక్క పరిమాణము కొత్తగా ఎదుగుతున్న భారతదేశంలో ఒక గణనీయమైన పాత్రను పోషించే సంభావ్యతను కలిగి ఉంది. భౌగోళిక నివాసాలకు మార్పిడులు, ఆర్థిక చేకూర్పుకు డిజిటల్ ఆకాంక్ష, సమాజంలో మారుతున్న మహిళల పాత్ర, మరియు బలమైన పన్ను సమ్మతివహింపు కారణంగా సాంప్రదాయ గిరాకీ అంశాలు ఎదురీతను ఎదుర్కొంటున్నట్లు అనిపించినప్పటికీ, బంగారం యొక్క బహుళ వాడకాలు అనేక సామాజిక మరియు ఆర్థిక అవసరాలను తీరుస్తున్నందున అది స్థితిస్థాపకంగానే ఉంది. భారతదేశం తన సాంప్రదాయ వాతావరణంలో బంగారంతో ముడిపడి ఉన్న తీరు ఆచరణలో గృహ పరిజ్ఞానము గురించి ఎంతగానో చెబుతుంది, దానిని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సందర్భంలో బంగారం యొక్క విస్తృత నిల్వల్ని ఆర్థికీకరణ కోసం అంతే సమానంగా వినియోగించుకోవచ్చు. మహమ్మారి యొక్క గందరగోళ పరిస్థితుల్లో బంగారం తనకు తానుగా, సంక్షోభ సమయాల్లో విశ్వసనీయమైన, అత్యున్నత పనితీరును కనబరచే ఆస్తిగా తన పాత్రను నొక్కి వక్కాణించింది మరియు దేశ ఆర్థిక పరిస్థితిలో మొత్తంగా రిస్క్ వాంఛను పెంచడానికి బంగారాన్ని వాడుకునే అవకాశాలను అందించడానికి ఇది కట్టుబడి ఉంది. బంగారం వెన్నుదన్ను గల ఆర్థిక ఉత్పాదనలు మరియు ఫిన్‌టెక్ బంగారం యొక్క అభివృద్ధి, ఇవన్నీ కలిపి ఇంట్లో నిర్బంధములో ఉన్న దానికి ప్రత్యామ్నాయముగా బంగారం యొక్క సంస్థాగత సామూహిక నిల్వలు ఉండేలా చేస్తున్నాయి, సమగ్ర బంగారం సముపార్జన ఫ్రేమ్‌వర్క్ లో భాగంగా వీటిని ప్రోత్సహించాల్సి ఉంది. కొనుగోలులో పారదర్శకతను ప్రోత్సహించడానికై ద్రవ్యమార్పిడి ట్రేడింగ్ పద్ధతి మరియు సాహసోపేతమైన పన్ను ప్రోత్సాహకాలు బంగారం మానిటైజేషన్‌ని నొక్కి చెప్పే మరింత సంఘటిత రీసైక్లింగ్ మార్కెట్ కు ప్రాథమ్యాలుగా ఉన్నాయి. భారతదేశం అటువంటి అనేక రంగాలను అధికారికంగా ప్రకటించే దిశగా దూసుకువెళుతోంది కాబట్టి, తర్వాత రాబోయే కొద్ది సంవత్సరాలలో బంగారం యొక్క పెట్టుబడి ముఖం మొత్తం మీద ఆశాజనకంగా కనిపిస్తోంది” అన్నారు.

Spread the love