అశ్వారావుపేట మండలానికి మరొకరికి చోటు..

– ఎంపీపీ శ్రీరామమూర్తి పేరు జోడించి మరో జాబితా విడుదల..
– సమన్వయంలోనూ అశ్వారావుపేటకు దక్కని సముచిత స్థానం వార్తకు స్పందన
నవతెలంగాణ – అశ్వారావుపేట
నవతెలంగాణ లో శనివారం సమన్వయం లోనూ అశ్వారావుపేట కు దక్కని సముచిత స్థానం అనే శీర్షికన ప్రచురితం అయిన కథనానికి స్పందన వచ్చింది. నవతెలంగాణ కధనం టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు నోచుకుంది.ఈ వార్త కటింగ్ ను టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూధన్,ఎం.పి నామా నాగేశ్వరరావు లకు సోషల్ మీడియా ద్వారా స్థానిక నాయకులు చేర్చారు.దీంతో శుక్రవారం ప్రకటించిన సమన్వయ కమిటీ జాబితాలో అదనంగా ఎంపీపీ జల్లి పల్లి శ్రీరామ మూర్తి పేరు ను చేర్చి 12 మందితో మరో జాబితాను తాతా మధుసూధన్ విడుదల చేసారు.
Spread the love