యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ప్రయోగం సక్సెస్‌

యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ప్రయోగం సక్సెస్‌– డీఆర్‌డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన మిస్సైల్‌
న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌’ (ఎంపీఏటీజీఎం)ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. దీంతో సైన్యంలోకి యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను చేర్చడానికి మార్గం సుగమమైంది. ఈ క్షిపణిని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజే షన్‌ (డీఆర్‌డీఓ) డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసినట్టుర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎంపీఏటీజీఎం లాంచర్‌, టార్గెట్‌ అక్విజిషన్‌ ఎక్విప్మెంట్‌, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉన్నాయని, ఈ క్షిపణి వ్యవస్థను తేలికగా తీసుకువెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంపీఏటీజీఎం ఆయుధ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మదింపు చేసినట్టు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఆయుధ వ్యవస్థను శనివారం పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేం జ్‌లో విజయవంతంగా పరీక్షించినట్టు పేర్కొంది. మిస్సైల్‌ సిస్టమ్‌ అద్భుతమైన పనితీ రును కనబరిచిందని, ఈ యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయా ల్లోనూ వినియోగించవచ్చని తెలిపింది.యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను విజయవం తంగా పరీక్షించినందుకు డీఆర్‌డీఓ, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. ఆధునిక సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో స్వావలం బన సాధించే దిశగా ఇది ఓ కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

Spread the love