నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పీఠం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మే 13న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పోల్స్లో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది స్పష్టం తెలియజేశాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన సర్వేల ఆధారంగా ఈ పోల్స్ను విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చాశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ఎన్నికల పోలింగ్లో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేకే సర్వీస్ (అసెంబ్లీ)
టీడీపీ-133
వైసీపీ-14
జనసేన-21
బీజేపీ-7
కేకే సర్వీస్ (పార్లమెంట్)
టీడీపీ-17
వైసీపీ-0
జనసేన-6
బీజేపీ-6
పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)
టీడీపీ-95-110
వైసీపీ-45-60
జనసేన-14-20
బీజేపీ-2-5
పీపుల్స్ పల్స్ (పార్లమెంట్ )
టీడీపీ-13-15
వైసీపీ-3-5
జనసేన-2
బీజేపీ-2-4